

హైదరాబాద్: తెలుగు సినీ పరిశ్రమకు కీలక సంస్థ అయిన తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో నిర్మాత మోహన్ వడ్లపట్ల మరోసారి ముఖ్యమైన బాధ్యతను అందుకున్నారు. ‘మన ప్యానల్’ నుంచి పోటీ చేసిన ఆయన, నిర్మాతల విభాగానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడిగా విజయం సాధించారు. అనంతరం 2025–2027 పదవీకాలానికి సంయుక్త కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఈ సందర్భంగా మోహన్ వడ్లపట్ల తనపై నమ్మకం ఉంచిన సభ్యులందరికీ, నూతన కమిటీకి కృతజ్ఞతలు తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతను నిజాయితీగా నిర్వర్తిస్తానని చెప్పారు. గతంలో దిల్ రాజు అధ్యక్షుడిగా ఉన్న సమయంలో సంయుక్త కార్యదర్శిగా పనిచేసిన అనుభవం ఉందని, ఈసారి అధ్యక్షుడిగా దగ్గుబాటి సురేష్ బాబు ఉన్న కమిటీలో పని చేయడం సంతోషంగా ఉందని ఆయన తెలిపారు.
.jpeg)
నూతన కార్యవర్గంలో ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడిగా దగ్గుబాటి సురేష్ బాబు, వైస్ ప్రెసిడెంట్లుగా నాగవంశీ మరియు భరత్ చౌదరి, కార్యదర్శిగా అశోక్ కుమార్, ట్రెజరర్గా ముత్యాల రాందాస్ ఎన్నికయ్యారు. ఈ కమిటీ 2027 వరకు కొనసాగనుంది. నిర్మాణ, పంపిణీ, ప్రదర్శన రంగాలకు మార్గనిర్దేశం చేసే సంస్థగా ఫిల్మ్ ఛాంబర్ కొనసాగుతున్న నేపథ్యంలో, మోహన్ వడ్లపట్ల ఏకగ్రీవ ఎన్నిక పరిశ్రమకు మంచి సంకేతంగా భావిస్తున్నారు. ఆయన అనుభవం, పరిశ్రమ పట్ల నిబద్ధత ఫిల్మ్ ఛాంబర్కు మరింత బలం చేకూరుస్తుందని పలువురు నిర్మాతలు అభినందనలు తెలుపుతున్నారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!