
ఓటీటీ

‘ప్రేమలు’ సినిమాతో యువతను ఆకట్టుకున్న మమితా బైజు ఇప్పుడు తన తొలి నాయికా ప్రాధాన్య చిత్రానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. త్వరలో ‘విశ్వనాథ్ అండ్ సన్స్’, ‘జన నాయగన్’ వంటి భారీ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రానున్న ఆమె, ఇప్పుడు ఈ కొత్త ప్రాజెక్ట్తో మరో అడుగు ముందుకు వేస్తున్నారు. ‘లవ్ టుడే’, ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ సినిమాలతో గుర్తింపు పొందిన ప్రదీప్ రంగనాథన్ ఈ చిత్రంతో నిర్మాతగా మారనున్నట్లు తెలుస్తోంది.
ఆయన వద్ద అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేసిన యువ దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించనుండగా, దర్శకుడు అశ్వత్ మారిముత్తు కీలక పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ఈ చిత్రం ఇటీవల చెన్నైలో లాంఛనంగా ప్రారంభమైందని, త్వరలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్పై ఇండస్ట్రీలో మంచి ఆసక్తి నెలకొంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!