
జనరల్

ఉప్పల్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన టీజీ20 తొలి సీజన్ ఫైనల్లో హైదరాబాద్ ఇ-ఛాంపియన్స్ అద్భుత ప్రదర్శనతో ఛాంపియన్గా నిలిచింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న హైదరాబాద్ బౌలర్లు అన్విత ఖమ్మం ఏసెస్ను 157/8కే పరిమితం చేశారు. మిక్కిల్ జైస్వాల్ 65 పరుగులతో పోరాడినా, యశ్వీర్ గౌడ్ మూడు వికెట్లు, దేవ్ మెహతా మరియు అజయ్ దేవ్ గౌడ్ చెరో రెండు వికెట్లు తీసి జట్టుకు ఆధిక్యం తీసుకొచ్చారు.
జైస్వాల్, కొడిమెల హిమతేజ మధ్య కీలక భాగస్వామ్యం నెలకొన్నప్పటికీ, చివరి ఓవర్లలో హైదరాబాద్ బౌలర్లు మ్యాచ్ను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకొచ్చారు. మ్యాచ్ ప్రారంభానికి ముందు టీజీ20 లీగ్ బ్రాండ్ అంబాసిడర్ విజయ్ దేవరకొండ ఇరు జట్లతో కలిసి జాతీయ గీతంలో పాల్గొని, సంప్రదాయ గంట మోగించి ఫైనల్కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!