
సినిమాలు

సూపర్ స్టార్ మహేశ్ బాబు తన రాబోయే చిత్రం ‘వారణాసి’ కోసం జర్మనీలోని బ్లాక్ ఫారెస్ట్ ప్రాంతంలో కఠిన శిక్షణ తీసుకుంటున్నారు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్ కోసం డాక్టర్ హ్యారీ కోనిగ్ పర్యవేక్షణలో ప్రత్యేక ఫిట్నెస్ ట్రైనింగ్, ట్రెక్కింగ్, రిజువనేషన్ కార్యక్రమాలు చేస్తున్నారు. మహేశ్ క్రమశిక్షణ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
ఈ భారీ ప్రాజెక్ట్లో ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటిస్తుండగా, పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ పాత్రలో కనిపించనున్నారు. ఎంఎం కీరవాణి సంగీతం, విజయేంద్ర ప్రసాద్ కథ ఈ సినిమాకు ప్రధాన బలం. ‘రుద్ర’ పాత్ర కోసం మహేశ్ బాబు చేస్తున్న మేకోవర్ సినిమాపై అంచనాలను మరింత పెంచుతోంది.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!