
రాజకీయాలు

టాలీవుడ్ నటి, బీజేపీ నేత మాధవీలత మరోసారి సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలతో చర్చనీయాంశంగా మారారు. మహిళలు, పురుషులపై సమాజం చూపుతున్న భిన్న దృక్పథాన్ని ప్రశ్నిస్తూ ఆమె పోస్ట్ చేశారు. మగవారు మద్యం సేవిస్తే సాధారణంగా చూస్తారని, అదే మహిళలు చేస్తే విమర్శలు ఎదుర్కొంటారని పేర్కొన్నారు. అలాగే ఇంటి పనులు భార్యాభర్తలిద్దరి బాధ్యతేనని, వాటిని ఒకే లింగానికి పరిమితం చేయడం సరైంది కాదని అభిప్రాయపడ్డారు.
మాధవీలత చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీశాయి. కొందరు ఆమె అభిప్రాయాలను సమర్థిస్తుండగా, మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. గతంలో కూడా మత, రాజకీయ అంశాలపై చేసిన వ్యాఖ్యలతో ఆమె వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!