

గ్లామరస్ నటి రాశీ ఖన్నా భారతీయ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి 13 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. 2013లో ‘మద్రాస్ కేఫ్’ సినిమాతో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె.. ఆ తర్వాత తెలుగు, తమిళం, హిందీ, మలయాళ భాషల్లో విభిన్న పాత్రలు పోషిస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తన 13 ఏళ్ల సినీ ప్రయాణం ఎంతో వేగంగా సాగిపోయిందని, నటనను గొప్ప వరంగా భావించడం, సినిమాలపై ఉన్న ఇష్టమే తనను నిరంతరం ముందుకు నడిపిస్తున్నాయని రాశీ ఖన్నా తెలిపారు. తనకు నచ్చిన కథల్లో భాగమయ్యే అవకాశం లభించడం ఎంతో సంతోషంగా ఉందని, ఈ ప్రయాణంలో తనను ప్రోత్సహించిన దర్శకులు, నిర్మాతలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
ప్రస్తుతం రాశీ ఖన్నా పలు ఆసక్తికర ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. రాజ్ అండ్ డీకే తెరకెక్కిస్తున్న ‘ఫర్జీ’ సీజన్ 2లో ఆర్బీఐ అధికారి మేఘా వ్యాస్ పాత్రలో ఆమె మరోసారి కనిపించనున్నారు. షాహిద్ కపూర్, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సిరీస్పై భారీ అంచనాలు ఉన్నాయి. అలాగే సూపర్స్టార్ రజినీకాంత్ నటిస్తున్న ‘ధర్మన్’ అనే తమిళ యాక్షన్ థ్రిల్లర్లో హీరోయిన్గా నటిస్తున్నారు. మరోవైపు అక్షయ్ కుమార్ సరసన అనీస్ బాజ్మీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కామెడీ డ్రామాలోనూ రాశీ ఖన్నా సందడి చేయనున్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!