

టాలీవుడ్, కోలీవుడ్, శాండల్వుడ్ చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శ్రద్ధా శ్రీనాథ్ ప్రస్తుతం ‘బ్రో కోడ్’ చిత్రంతో బిజీగా ఉన్నారు. గత ఏడాది ‘ఆర్యన్’ సినిమాతో ప్రేక్షకులను అలరించిన ఆమె, తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ప్రస్తుత తరం నటీనటులు ఎదుర్కొంటున్న ఒత్తిడిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
“ఈ రోజుల్లో కేవలం నటిగా ఉండటం సరిపోదు. సామాజిక మాధ్యమాల్లో ఎప్పటికప్పుడు కనిపిస్తూ, మన ఉనికిని గుర్తు చేస్తూ ఉండాలి. సినిమాల నాణ్యత కంటే ఆన్లైన్లో కనిపించడం ముఖ్యమైపోయింది. వ్యక్తిగత జీవితాన్ని నిరంతరం పంచుకోవడం నాకు ఇష్టం ఉండదు. కానీ అలా చేయకపోతే వెనుకబడిపోతామనే భయం ఉంటుంది” అని శ్రద్ధా తెలిపారు. ఇకపై చారిత్రక కథలు, విజ్ఞాన కథా చిత్రాలు, భావోద్వేగభరిత పాత్రలు, శారీరక శ్రమ ఎక్కువగా ఉండే పాత్రల్లో నటించాలని ఉందని ఆమె వెల్లడించారు. వెండితెరపై శక్తివంతమైన రాణి లేదా గూఢచారి పాత్ర చేయడం తన జీవితకాల కోరిక అని చెప్పారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!