

యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ భీమవరంలో నిర్వహించిన సేవా కార్యక్రమంలో 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు చదువుతున్న దాదాపు 1000 మంది విద్యార్థులకు స్టడీ కిట్లు అందజేశారు. నోట్బుక్స్, పెన్నులు, చదువుకు అవసరమైన సామగ్రితో కూడిన ఈ కిట్లను చిన్నారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, తన జీవితంలో విద్య ఎంతో కీలక పాత్ర పోషించిందని, ప్రతి విద్యార్థి చదువుపై దృష్టి పెట్టి జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని సూచించారు.
హైదరాబాద్లో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించేవాడినని, ఇప్పుడు అన్ని ప్రాంతాలకు విస్తరిస్తున్నామని నిఖిల్ తెలిపారు. ఒక నటుడిగా సమాజానికి తిరిగి ఏదో ఒకటి ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు చెప్పారు. ట్రస్ట్ ఏర్పాటు చేసే ఆలోచన ఉందని, అయితే సేవ చేయడానికి ట్రస్ట్ తప్పనిసరి కాదని అన్నారు. గతంలో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలను నిశ్శబ్దంగా నిర్వహించానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పంపిణీ చేసిన స్టడీ కిట్లపై తన రాబోయే చిత్రం ‘స్వయంభు’ పోస్టర్ ఉండటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!