
జనరల్

టాలీవుడ్ యంగ్ హీరోయిన్ రితిక నాయక్ విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కిన ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తర్వాత ‘మీరాయ్’ పాన్ ఇండియా విజయంతో ఆమెకు మరింత గుర్తింపు వచ్చింది. ప్రస్తుతం వరుణ్ తేజ్ హీరోగా, మెర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కొరియన్ కనకరాజు’ చిత్రంలో కథానాయికగా నటించిన రితిక, ఈ సినిమా ఆగస్టు 7న విడుదలకు సిద్ధమవుతోంది.
సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రితిక తన తొలి సినిమా సమయంలో ఎదురైన అనుభవాన్ని పంచుకుంది. ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ ప్రమోషన్లకు తనను పిలవకపోవడంతో చాలా బాధపడ్డానని తెలిపింది. అయితే సినిమా విడుదలైన తర్వాత అందులో నటించిన వారిలో తనకే ఎక్కువ గుర్తింపు రావడం ఆనందాన్ని కలిగించిందని చెప్పింది. ప్రేక్షకుల ఆదరణే తనకు మరింత ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చిందని రితిక వెల్లడించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!