

పాన్ ఇండియా మైథలాజికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ‘నాగబంధం’ మరో కీలక అప్డేట్తో వార్తల్లో నిలిచింది. దర్శకుడు అభిషేక్ నామా రూపొందిస్తున్న ఈ భారీ చిత్రానికి ప్రముఖ నిర్మాణ సంస్థ జీ స్టూడియోస్ ఉత్తర భారత పంపిణీ హక్కులను దక్కించుకుంది. అన్ని భాషల్లో ఈ సినిమాను ప్రజెంట్ చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించడంతో దేశవ్యాప్తంగా సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది.
ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో సినిమాపై మంచి హైప్ ఏర్పడింది. విజువల్స్, గ్రాఫిక్స్, మైథలాజికల్ ఎలిమెంట్స్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. భారీ బడ్జెట్తో రూపొందుతున్న ఈ చిత్రం జులై 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. పాన్ ఇండియా మార్కెట్ను లక్ష్యంగా చేసుకుని భారీ ప్రమోషన్స్కు మేకర్స్ సిద్ధమవుతున్నారు.
విరాట్ కర్ణ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో నభా నటేష్, ఐశ్వర్య మీనన్ కథానాయికలుగా కనిపించనున్నారు. జగపతి బాబు, మురళీ శర్మ, జయప్రకాశ్, అనసూయ భరద్వాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. దర్శకుడు అభిషేక్ నామా ఈ సినిమాను విజువల్ వండర్గా తీర్చిదిద్దుతున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి.
జీ స్టూడియోస్ వంటి ప్రముఖ సంస్థ అండగా నిలవడంతో ‘నాగబంధం’కు నార్త్ మార్కెట్లో మంచి రీచ్ లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. విడుదల తర్వాత ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో సెన్సేషన్ సృష్టించే ఛాన్స్ ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!