

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రంలో ఈసారి ప్రత్యేక ఐటమ్ సాంగ్ ఉండబోదని దర్శకుడు స్పష్టం చేశారు. గతంలో వీరి కాంబినేషన్లో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ చిత్రంలోని ‘కెవ్వు కేక’ పాట ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న నేపథ్యంలో, ఆయన హుందాతనాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు హరీష్ శంకర్ తెలిపారు.
డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న వ్యక్తి ఐటమ్ సాంగ్లో కనిపించడం సరైనదిగా ఉండదని భావించి ఆ తరహా మాస్ నంబర్ను చిత్రంలో చేర్చలేదని ఆయన వివరించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రం మార్చి 19న గ్రాండ్గా విడుదల కానుంది. ఇందులో శ్రీలీల, రాశీ ఖన్నా కథానాయికలుగా నటిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా, థమన్ నేపథ్య సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలు ప్రేక్షకులను ఆకట్టుకోగా, త్వరలోనే మూడో సింగిల్ను విడుదల చేయడానికి చిత్ర బృందం సిద్ధమవుతోంది. పవన్ కళ్యాణ్ ఇమేజ్కు అనుగుణంగా పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!