

అల్లు అర్జున్ కథానాయకుడిగా, దీపికా పదుకొనే కథానాయికగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘రాకా’పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. దర్శకుడు అట్లీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం విజువల్ గ్రాండియర్, భారీ యాక్షన్ సన్నివేశాలు, అంతర్జాతీయ స్థాయి సాంకేతిక ప్రమాణాలతో రూపొందుతోంది. ఈ క్రమంలో నటి ప్రీతీ ముకుందన్ కూడా ఈ చిత్రంలో నటించాల్సి ఉందనే వార్త సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఇటీవల జరిగిన ఓ సినిమా ప్రచార కార్యక్రమంలో దర్శకుడు అట్లీ మాట్లాడుతూ, ముందుగా ఒక కీలక పాత్ర కోసం ప్రీతీ ముకుందన్ను సంప్రదించినట్లు తెలిపారు. అయితే ఆమె వరుస సినిమాలతో బిజీగా ఉండటంతో తేదీలు సర్దుబాటు కాకపోవడంతో ఆ అవకాశం చేజారిందని వెల్లడించారు. అనంతరం ఆ పాత్రకు ఫెమినా జార్జ్ను ఎంపిక చేసినట్లు సమాచారం. దీంతో ఈ వార్త ప్రస్తుతం సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!