

దిగ్గజ దర్శకుడు శంకర్ ఎన్నేళ్లుగా కలగా భావిస్తున్న ‘వెల్పరి’ ప్రాజెక్ట్ను ఆరంభించేందుకు మళ్లీ ప్రయత్నాలు వేగవంతం చేస్తున్నట్లు సమాచారం. భారీ బడ్జెట్, అత్యాధునిక విజువల్ టెక్నాలజీతో రూపొందే ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో భారీగా తెరకెక్కించాల్సిన అవసరం ఉండడంతో, సరైన హీరో ఎంపిక పై శంకర్ ప్రత్యేకంగా దృష్టి పెట్టాడు.
కోలీవుడ్లో ఈ స్థాయి ప్రాజెక్ట్ను మోస్తున్న స్టార్ కాంబినేషన్ లేకపోవడంతో, ఆయన టాలీవుడ్ మార్కెట్ వైపు చూడాలని నిర్ణయించినట్లు ఇండస్ట్రీ టాక్. ప్రభాస్, మహేష్ బాబు లాంటి పాన్ ఇండియా ఇంపాక్ట్ ఉన్న హీరోలను సంప్రదించాలని శంకర్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి భారీ విజువల్ ఎక్స్పీరియెన్స్కి ఈ స్థాయి హీరోలే సరిపోతారనే భావనతో ఈ ఆలోచన కొనసాగుతున్నట్టు సమాచారం.
అయితే, ప్రభాస్ – మహేష్ ఇద్దరూ ఇప్పటికే వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉండడంతో శంకర్ వారికోసం వేచి చూస్తాడా? లేక ప్రత్యామ్నాయంగా మరో స్టార్ను ఎంపిక చేస్తాడా? అనేది ఇప్పటికీ క్లారిటీ రాలేదు. ‘వెల్పరి’ పై ఇండస్ట్రీలో భారీ అంచనాలు ఉండటంతో, హీరో ఎంపిక పై అందరి దృష్టి నిలిచింది.



.jpg&w=3840&q=75)
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!