

క్రిస్టఫర్ నోలన్ తెరకెక్కించిన విజువల్ వండర్ ‘ది ఒడిస్సీ’ పైరసీ బారిన పడినట్లు సమాచారం. సినిమాకు సంబంధించిన హై క్వాలిటీ ప్రింట్ ఆన్లైన్లో లీక్ కావడం చిత్రబృందాన్ని ఆందోళనకు గురిచేసింది. పూర్తి సినిమా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ‘ఎక్స్’లో ప్రత్యక్షం కాగా, లీకైన కాపీని కొన్ని గంటల్లోనే దాదాపు 21 లక్షల మంది వీక్షించినట్లు సమాచారం. ఈ వ్యవహారంపై వెంటనే స్పందించిన నిర్మాణ సంస్థ కాపీరైట్ చట్టాల ప్రకారం న్యాయపరమైన చర్యలు ప్రారంభించడంతో పాటు లీకైన వీడియో లింకులు, వాటిని పోస్ట్ చేసిన ఖాతాలను తొలగించే చర్యలు చేపట్టింది.
పైరసీ సమస్య ఎదురైనప్పటికీ ‘ది ఒడిస్సీ’ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకెళ్తున్నట్లు సమాచారం. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం 700 మిలియన్ డాలర్ల మార్క్కు చేరువలో ఉండగా, భారత్లోనూ ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. తొలి వారంలోనే రూ.100 కోట్ల గ్రాస్ మార్క్ను దాటిన సినిమా, ఇప్పటివరకు భారత్లో దాదాపు రూ.147 కోట్ల వసూళ్లు సాధించినట్లు తెలుస్తోంది. ప్రాచీన గ్రీకు కవి హోమర్ రచించిన ‘ది ఒడిస్సీ’ ఇతిహాసం ఆధారంగా క్రిస్టఫర్ నోలన్ ఈ చిత్రాన్ని రూపొందించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!