.jpg&w=3840&q=75)

రణ్వీర్ సింగ్ హీరోగా నటించిన ‘ధురంధర్ 2: ది రివెంజ్’ బాక్సాఫీస్ వద్ద భారీ దూకుడు కొనసాగిస్తోంది. విడుదలైన తొలి వారాంతంలోనే ఈ చిత్రం రూ.330 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుతం ‘పుష్ప 2’ ఓపెనింగ్ రికార్డును దాటేందుకు ఈ సినిమా దగ్గరపడింది. ప్రేక్షకుల నుంచి సూపర్హిట్ టాక్ రావడంతో థియేటర్లు కిటకిటలాడుతున్నాయి.
తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో కూడా సినిమా విడుదల కావడంతో వసూళ్లు మరింత పెరిగే అవకాశముంది. దేశవ్యాప్తంగా 14 వేలకుపైగా షోలు ప్రదర్శించబడుతుండగా, 74 శాతానికి పైగా ఆక్యుపెన్సీ నమోదవడం విశేషం. చాలా రోజుల తర్వాత బాక్సాఫీస్ వద్ద ఈ స్థాయిలో సందడి కనిపిస్తోందని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఈ చిత్రంపై ప్రముఖ దర్శకుడు రాజమౌళి ప్రశంసలు కురిపించారు. నాలుగు గంటల నిడివితో సినిమా తీయడం గొప్ప విషయం అని, దర్శకుడు ఆదిత్యధర్ ధైర్యాన్ని మెచ్చుకున్నారు. అలాగే రామ్ చరణ్, మహేశ్ బాబు, విజయ్ దేవరకొండ, రవితేజ వంటి స్టార్ హీరోలు కూడా సినిమాపై ప్రశంసలు కురిపించారు. రామ్ గోపాల్ వర్మ అయితే ఈ చిత్రాన్ని ఇండియన్ సినిమాకు కొత్త బెంచ్మార్క్గా అభివర్ణించారు.










.jpg&w=3840&q=75)











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!