
జనరల్

కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్, సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కుతున్న ‘సిగ్మా’ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నట్లు అధికారికంగా వెల్లడించారు. ఈ విషయాన్ని ధృవ్ తన సోషల్ మీడియా వేదికగా ప్రకటించి అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చారు. అయితే సినిమాలో ఆయన పాత్రకు సంబంధించిన పూర్తి వివరాలను మాత్రం చిత్రబృందం ప్రస్తుతం గోప్యంగా ఉంచింది.
ఈ చిత్రంతో ధృవ్ విక్రమ్ తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెడుతున్నారు. అలాగే నటుడు విజయ్ కుమారుడు జాసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయం అవుతున్న తొలి చిత్రం కూడా ఇదే కావడం విశేషం. సందీప్ కిషన్, ఫరియా అబ్దుల్లా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో జూలై 31న విడుదల కానున్న ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!