

డి.సురేష్ బాబు “దగ్గుబాటి కుటుంబం జనవరి 23 న కోర్టుకు హాజరు కావాలని ఆదేశం” అనే అవాస్తవ, తప్పుదారి పట్టించే వార్తా కథనాన్ని తీవ్రంగా ఖండించారు. అధికారిక న్యాయ రికార్డుల ప్రకారం, 14-11-2025 తేదీ ఉత్తర్వులలో హైదరాబాద్ XVII అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ స్పష్టం చేశారు — వ్యక్తిగత హాజరు కోసం ఎలాంటి అత్యవసరత లేదు, అలాగే నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ అవసరం లేదు. ఈ కేసు కేవలం క్రిమినల్ మిసిలేనియస్ పిటిషన్ల పరిష్కారం కోసం 09-01-2026 కి వాయిదా వేసారు.
అయితే, ఈ స్పష్టమైన న్యాయ రికార్డులు ఉన్నప్పటికీ, సదరు ఇంగ్లీష్ దినపత్రిక వాస్తవాలను వక్రీకరించి సంచలనాత్మక కథనం ప్రచురించడం ద్వారా ప్రజలను తప్పుదారి పట్టించడం మరియు వ్యక్తుల గౌరవానికి నష్టం కలిగించడం జరిగింది. డీ. సురేష్ బాబు న్యాయ ప్రక్రియకు పూర్తిగా సహకరిస్తున్నట్లు, న్యాయవ్యవస్థపై విశ్వాసం కలిగినట్టు చెప్పారు. వ్యక్తుల గౌరవానికి గంభీర ప్రభావం కలిగించే వార్తలు ప్రచురించే ముందు అధికారిక కోర్ట్ రికార్డులను పరిశీలించి, బాధ్యతాయుతమైన జర్నలిజాన్ని పాటించాలని ఆయన మీడియాను కోరారు.















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!