

దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘వారణాసి’ చిత్రం గురించి రోజురోజుకీ ఆసక్తికర సమాచారం బయటకు వస్తోంది. భారతీయ సినీ పరిశ్రమలోనే అత్యంత భారీ ప్రాజెక్ట్లలో ఒకటిగా భావిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. తాజా సమాచారం ప్రకారం జూన్ రెండో వారం నుంచి కీలక యాక్షన్ షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్లో హీరో మహేశ్ బాబుపై భారీ యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. ఈ వార్తతో అభిమానుల్లో అంచనాలు మరింత పెరిగాయి.
హాలీవుడ్ స్థాయి విజువల్స్ కోసం అంతర్జాతీయ స్టంట్ మాస్టర్లను తీసుకువచ్చినట్లు సమాచారం. దాదాపు నెల రోజుల పాటు నిరంతరాయంగా షూటింగ్ కొనసాగించేందుకు ప్రణాళిక రూపొందించారు. అడవులు, పురాతన దేవాలయాలు, భారీ సెట్ల మధ్య ఈ యాక్షన్ సన్నివేశాలు తెరకెక్కనున్నాయి. ఇదే సమయంలో మహేశ్ బాబు ద్విపాత్రాభినయం చేస్తున్నారనే వార్త మరింత ఆసక్తిని పెంచుతోంది. అలాగే ప్రియాంక చోప్రా ‘మందాకిని’ అనే కీలక పాత్రలో నటిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. భారతీయ పురాణాల నేపథ్యంతో అడ్వెంచర్ థ్రిల్లర్గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!