

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్లో తెరకెక్కిన ‘పెద్ది’ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా దూసుకుపోతోంది. ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు సాధిస్తూ ఈ చిత్రం ఈ ఏడాది అత్యంత విజయవంతమైన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ప్రేక్షకుల నుంచి లభిస్తున్న అద్భుత స్పందన నేపథ్యంలో చిత్రబృందం హైదరాబాద్లో గ్రాండ్ సక్సెస్ మీట్ నిర్వహించేందుకు సిద్ధమైంది.

జూన్ 23న హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో సాయంత్రం 6 గంటల నుంచి ఈ వేడుక ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరవుతుండటం విశేషం. రామ్ చరణ్, బుచ్చిబాబు సానా, చిత్ర యూనిట్ సభ్యులు అందరూ ఈ వేడుకలో పాల్గొననున్నారు. జాన్వీ కపూర్, శివ రాజ్కుమార్, దివ్యేందు శర్మ, జగపతి బాబు, బొమన్ ఇరానీ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!