

భర్త మహాశయులకు విజ్ఞప్తి అందరూ రిలేట్ అయ్యే మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని హీరోయిన్లు డింపుల్ హయాతి, ఆషిక రంగనాథ్ తెలిపారు. మాస్ మహారాజా రవితేజ హీరోగా, కిశోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. ఇప్పటికే టీజర్, ట్రైలర్, పాటలతో భారీ బజ్ క్రియేట్ చేసిన ఈ సినిమా ఈ నెల 13 న థియేటర్లలో విడుదల కానుంది.
విలేకరుల సమావేశంలో ఆషిక రంగనాథ్ మాట్లాడుతూ, మానస శెట్టి పాత్ర ఈ తరం అమ్మాయిలకు బాగా కనెక్ట్ అయ్యేలా ఉంటుందని చెప్పారు. రవితేజ గారి ఎనర్జీని మ్యాచ్ చేయడం ఛాలెంజ్ అయినా, ఆయనతో కలిసి పని చేయడం చాలా ఆనందంగా అనిపించిందన్నారు. ప్రస్తుతం ఉన్న రిలేషన్షిప్ కాన్ఫ్లిక్ట్స్ను దర్శకుడు చాలా సెన్సిబుల్గా, సహజంగా హ్యాండిల్ చేశారని ఆమె పేర్కొన్నారు.
డింపుల్ హయాతి మాట్లాడుతూ, బాలామణి పాత్ర తనకు పూర్తిగా కొత్త అనుభూతినిచ్చిందని తెలిపారు. ఈ సినిమాలో ఒక ప్రత్యేకమైన సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉందని, అది ప్రేక్షకులు థియేటర్లోనే చూడాలని చెప్పారు. విజువల్స్, డ్యాన్స్ నెంబర్స్, కామెడీ టైమింగ్ అన్నీ సినిమాకు ప్రధాన బలాలుగా నిలుస్తాయని, కుటుంబ ప్రేక్షకులు తప్పకుండా ఎంజాయ్ చేసే చిత్రమని ఇద్దరు హీరోయిన్లు నమ్మకం వ్యక్తం చేశారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!