
సినిమాలు

టాలీవుడ్ హీరో అల్లు శిరీష్ మరియు నయనిక ఇటీవల వివాహ బంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నూతన దంపతులను ఆశీర్వదించేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా నిర్మాత అల్లు అరవింద్ నివాసానికి వెళ్లారు.
అక్కడ అల్లు శిరీష్ – నయనిక దంపతులను కలిసిన సీఎం చంద్రబాబు వారికి శుభాకాంక్షలు తెలియజేసి, నిండు నూరేళ్లు సుఖసంతోషాలతో జీవించాలని ఆశీర్వదించారు. సీఎం తమ ఇంటికి విచ్చేసిన సందర్భంగా అల్లు అరవింద్ కుటుంబ సభ్యులు ఆయనకు సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నిర్మాత అల్లు అరవింద్, చంద్రబాబు నాయుడిని శాలువాతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు.
అల్లు కుటుంబం మరియు నారా కుటుంబాల మధ్య చాలా కాలంగా కొనసాగుతున్న అనుబంధాన్ని ఈ భేటీ మరోసారి గుర్తు చేసింది. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు మరియు కొంతమంది సన్నిహితులు మాత్రమే పాల్గొన్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!