

దర్శకుడు అనిల్ రావిపూడి తన పదో సినిమాతో మరోసారి అందరి దృష్టిని ఆకర్షించారు. ‘మన శంకరవరప్రసాద్ గారు’ విజయానంతరం ఆయన వెంకటేశ్, కల్యాణ్ రామ్లతో మల్టీస్టారర్ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు కొనసాగుతుండగా, ఇప్పటికే ప్రథమార్ధం పూర్తయింది. ద్వితీయార్థం రచన దశలో ఉంది. జూలై లేదా ఆగస్టులో సినిమా ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఈ సినిమాను భారీ స్థాయిలో, కొత్త హంగులతో రూపొందించేందుకు ప్లాన్ చేస్తున్నారు. కథ అవసరాలను బట్టి సంగీత దర్శకులను ఎంపిక చేసే అనిల్ రావిపూడి ఈసారి జి.వి. ప్రకాశ్ కుమార్ను సంగీత బాధ్యతలకు తీసుకున్నారు.
ఈ చిత్రం కలర్ఫుల్ ఎంటర్టైనర్గా రూపొందుతోంది. వెంకటేశ్ సరసన కీర్తి సురేశ్, కల్యాణ్ రామ్ సరసన కల్యాణి ప్రియదర్శన్ నటిస్తున్నారు. బలమైన కథ, వినోదాత్మక కథనంతో సినిమా రూపొందుతోంది. సంక్రాంతి విడుదల లక్ష్యంగా ఈ ప్రాజెక్ట్ ముందుకు సాగుతోంది. స్టార్ కాంబినేషన్, కమర్షియల్ ఎలిమెంట్స్తో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!