

ఆంధ్రప్రదేశ్ పశుసంవర్ధక శాఖలో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ (VAS) పోస్టుల భర్తీపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పోస్టుల నియామక ప్రక్రియను APPSCకి అప్పగిస్తూ సెప్టెంబర్ 13న జారీ చేసిన ఉత్తర్వులను ప్రభుత్వం ఉపసంహరించుకుంది. 2016లో జారీ చేసిన G.O. 52ను కొనసాగిస్తూ.. గతంలో మాదిరిగానే డిపార్ట్మెంటల్ సెలక్షన్ కమిటీ ద్వారా VAS పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించింది.
2026 జాబ్ క్యాలెండర్ రెండో దశలో ఉన్న VAS పోస్టులకు మెరిట్ ఆధారిత ఎంపిక విధానాన్ని అమలు చేయనున్నారు. అభ్యర్థులకు వర్తించే విద్యార్హతలు, అనుభవం తదితర అంశాల ఆధారంగా నిర్దేశిత వెయిటేజ్తో పాటు రిజర్వేషన్, రోస్టర్ నిబంధనలను పాటించనున్నారు. ఈ విధానం 2026 జాబ్ క్యాలెండర్లోని ప్రస్తుత నియామకాలకు మాత్రమే వర్తిస్తుందని, భవిష్యత్ నియామకాలకు దీనిని ప్రామాణికంగా పరిగణించరాదని ప్రభుత్వం స్పష్టం చేసినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!