

ఇటీవల మృణాల్ ఠాకూర్, నటుడు ధనుష్తో పెళ్లి జరుగబోతుందనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ వార్తలపై స్పందించిన మృణాల్, తన పేరుతో ఉన్న అధికారిక ఎక్స్ (ట్విట్టర్) ఖాతా ద్వారా స్పష్టమైన ప్రకటన చేసింది. ధనుష్తో తన పెళ్లి అంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఆమె తేల్చి చెప్పింది. ఇకపై ఇలాంటి పుకార్లను ప్రచారం చేయవద్దని ఆమె కోరింది.
మృణాల్ తన పోస్ట్లో మాట్లాడుతూ, “ధనుష్ నాకు అన్నయ్య లాంటి వాడు. మా మధ్య ఉన్నది పరస్పర గౌరవం, వృత్తి నైపుణ్యం మాత్రమే. అంతకుమించి ఏమీ లేదు” అని తెలిపింది. ఒక మహిళ చేసిన కష్టాన్ని, ఆమె ప్రయాణాన్ని గుర్తించకుండా, ఆమె వ్యక్తిగత జీవితం గురించి కథలు సృష్టించడం ఎందుకని ఆమె ప్రశ్నించింది.
తాను మౌనంగా ఉండటం అంటే ఏదో దాస్తున్నానని కాదని, తన వ్యక్తిగత జీవితానికి బహిరంగ ధృవీకరణ అవసరం లేదని మృణాల్ చెప్పింది. ఆడిషన్లు, తిరస్కరణలు, కష్టమైన రోజులు ఎదుర్కొని ఈ స్థాయికి చేరుకున్నానని, ఒక పుకారు ఆ ప్రయాణాన్ని తగ్గించడం అన్యాయమని పేర్కొంది. సోషల్ మీడియా అందరికీ స్వరం ఇస్తుందని, అదే సమయంలో బాధ్యత కూడా ఉండాలని చెప్పుతూ, ఈ పుకార్లలో ఎలాంటి నిజం లేదని మరోసారి స్పష్టం చేసింది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!