

శరీరంలో ఐరన్ లోపం ఉంటే అలసట, తల తిరగడం, రక్తహీనత వంటి సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా గర్భిణీలలో ఐరన్ అవసరం ఎక్కువగా ఉంటుంది. మొదటి త్రైమాసికంలో భ్రూణ అభివృద్ధి ప్రారంభ దశలో ఉండటంతో ఐరన్ అవసరం మితంగా ఉంటే, రెండో, మూడో త్రైమాసికాల్లో శిశువు వేగంగా పెరుగుతుండటంతో ఐరన్ అవసరం గణనీయంగా పెరుగుతుంది. నాన్-వెజ్ ఆహారాల్లో మేక మాంసం, కాలేయం (లివర్), చికెన్, చేపలు, గుడ్లు వంటి పదార్థాల్లో హీమ్ ఐరన్ అధికంగా లభిస్తుంది. ఇది శరీరానికి సులభంగా శోషించబడుతుంది. శాకాహారుల కోసం రాగి, జొన్న, సజ్జ, పాలకూర, కందులు, బెల్లం వంటి ఆహారాలు ఐరన్కు మంచి మూలాలు. అయితే విటమిన్ C ఉన్న పండ్లు (నారింజ, ఉసిరి, నిమ్మకాయ)తో పాటు తీసుకుంటే ఐరన్ శోషణ మెరుగుపడుతుంది. గర్భిణీలు వైద్యుల సలహా మేరకు ఐరన్ సప్లిమెంట్స్ తీసుకోవాలి. సాధారణంగా హిమోగ్లోబిన్ స్థాయి 12 గ్రాములు పైగా ఉంటే సాధారణంగా భావిస్తారు. తీవ్ర అనీమియా ఉన్నప్పుడు వైద్యులు ఇంజెక్షన్లు లేదా అవసరమైతే రక్త మార్పిడి సూచించవచ్చు. తల్లి ఐరన్ లోపం శిశువు బరువుపై, ప్రసవ సమయంలో రక్తస్రావ ప్రమాదంపై ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.







.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!