

చియా సీడ్స్లో అనేక పోషకాలు ఉన్నాయి. వీటిని రెగ్యులర్గా తీసుకుంటే శరీరానికి అవసరమైన విటమిన్లు, మినరల్స్, ఆరోగ్యకరమైన కొవ్వులు అందుతాయి. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునేవారికి ఇవి మంచి ఫలితాలు ఇస్తాయి. కానీ నిపుణుల హెచ్చరికలు మాత్రం గమనించాల్సిందే. ఎక్కువ మోతాదులో తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ తప్పవని చెబుతున్నారు. మరి చియా సీడ్స్ అతిగా తినడం వల్ల ఏం జరుగుతుందో తెలుసుకుందాం.
ఈ మధ్య చాలా మంది ఆరోగ్యంపై దృష్టి పెడుతున్నారు. కొలెస్ట్రాల్ తగ్గించుకోవడం, బరువు తగ్గడం కోసం డైట్లో మార్పులు చేస్తున్నారు. ఈ మార్పుల్లో చియా సీడ్స్ ముఖ్యమైన స్థానాన్ని సంపాదించాయి. వీటిని నీటిలో నానబెట్టి తింటే మలబద్ధకం తగ్గుతుంది. కానీ సరైన విధంగా వాడకపోతే ప్రయోజనాలకన్నా నష్టాలు ఎక్కువ.
చియా సీడ్స్లో ఫైబర్, ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. కానీ నీరు తక్కువగా తాగి ఎక్కువ మోతాదులో తింటే పొట్ట ఉబ్బరం, గ్యాస్, మలబద్ధకం, నొప్పి లాంటి సమస్యలు వస్తాయి.
చియా సీడ్స్ను నీటిలో నానబెట్టి తినాలి. నానబెట్టక పొడిగా తింటే అవి జీర్ణం కావు, గొంతులో ఇరుక్కుపోవచ్చు, నాలుకకు ఇబ్బంది కలిగిస్తుంది. పాలు లేదా పాల ఉత్పత్తులతో కలిపితే మందంగా మారి జీర్ణం కావడానికి సమయం ఎక్కువ పడుతుంది.
చియా సీడ్స్ బీపీ తగ్గించడంలో సహాయపడతాయి. కానీ ఇప్పటికే లో బీపీ ఉన్నవారు లేదా బీపీ మందులు వాడేవారు వీటిని తీసుకుంటే బీపీ మరింత పడిపోతుంది. ఇది ప్రమాదకరం. అలాగే ఫైబర్ ఎక్కువగా ఉన్న కూరగాయలతో వీటిని కలిపి తినకూడదు.
ఒమెగా-3 కారణంగా రక్తం పల్చగా మారుతుంది. రక్తం మందులు వాడుతున్నవారు ఎక్కువగా తింటే బ్లీడింగ్ ముప్పు ఉంటుంది. నారింజ, ద్రాక్ష వంటి అసిడిక్ పండ్లతో కలిపి తినకూడదు. అరటి, యాపిల్లతో కలిపి తినవచ్చు.
కొంత మందికి చియా సీడ్స్ వల్ల చర్మం మీద దద్దులు, కళ్లలో నీరు రావడం, శ్వాసలో ఇబ్బంది రావచ్చు. అలాంటి వారు దూరంగా ఉండాలి. చియా సీడ్స్లో కేలరీలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఫిజికల్ యాక్టివిటీ లేకుండా ఎక్కువగా తింటే బరువు పెరిగే ప్రమాదం ఉంది.
ఇది సాధారణ సమాచారం మాత్రమే. చికిత్సకు ఇది ప్రత్యామ్నాయం కాదు. చియా సీడ్స్ వాడేముందు వైద్యుడిని సంప్రదించండి.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!