

దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధి (CKD) ఉన్న మధుమేహ రోగుల్లో రక్తంలో చక్కెర స్థాయిలు ఎప్పుడూ ఎక్కువగా ఉంటాయని చాలా మంది భావిస్తారు. అయితే వైద్య నిపుణుల ప్రకారం పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉండొచ్చు. కిడ్నీల పనితీరు తగ్గినప్పుడు ఇన్సులిన్ శరీరంలో ఎక్కువసేపు నిల్వ ఉండి రక్తంలో చక్కెర స్థాయిలు ప్రమాదకరంగా తగ్గే అవకాశం ఉంటుంది. ఆకలి తగ్గడం, వికారం, బరువు తగ్గడం, పోషకాహార లోపం వంటి సమస్యలు కూడా హైపోగ్లైసీమియా ప్రమాదాన్ని పెంచుతాయి.
కిడ్నీలు గ్లూకోజ్ సమతుల్యతను కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయి. కిడ్నీల పనితీరు క్షీణించినప్పుడు చెమటలు పట్టడం, చేతులు వణకడం, తల తిరగడం, తీవ్రమైన ఆకలి, తలనొప్పి, చూపు మసకబారడం, గందరగోళం వంటి లక్షణాలు కనిపించవచ్చు. తీవ్రమైన పరిస్థితుల్లో స్పృహ కోల్పోవడం, ఫిట్స్ రావడం లేదా కోమాలోకి వెళ్లే ప్రమాదం కూడా ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అందుకే మధుమేహం మరియు కిడ్నీ వ్యాధి ఉన్నవారు రక్తంలో చక్కెర స్థాయిలను క్రమం తప్పకుండా పరిశీలించుకోవాలని సూచిస్తున్నారు.
గమనిక:
పైన పేర్కొన్న లక్షణాలు కనిపించినట్లయితే స్వయంగా మందులు వాడకుండా వెంటనే వైద్యులను సంప్రదించండి. వైద్యుల సలహా లేకుండా మధుమేహం మందుల మోతాదును మార్చకండి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!