

రవితేజ నటించిన ‘ఇరుముడి’ బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ రన్ కొనసాగిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే రూ.200 కోట్ల గ్రాస్ మార్క్ను దాటినట్లు సమాచారం. థియేటర్లలో సినిమాకు వస్తున్న స్పందనతో ఇప్పుడు ఓటీటీ రిలీజ్పై కూడా ఆసక్తికరమైన చర్చ మొదలైంది. ఈ చిత్ర డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకోగా.. ముందుగా సెప్టెంబర్ 18న ఓటీటీ ప్రీమియర్ ఉంటుందని వార్తలు వచ్చాయి.
అయితే థియేటర్లలో ‘ఇరుముడి’కి ప్రేక్షకుల ఆదరణ ఇంకా కొనసాగుతుండటంతో.. ఓటీటీ విడుదలను వాయిదా వేసే అంశాన్ని మేకర్స్ పరిశీలిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. థియేట్రికల్ వసూళ్లను మరింత పెంచుకునే ఉద్దేశంతో నిర్మాతలు, నెట్ఫ్లిక్స్ మధ్య చర్చలు జరుగుతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అయితే ఓటీటీ రిలీజ్ తేదీ మార్పుపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి జి.వి. ప్రకాశ్ కుమార్ సంగీతం అందించారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!