
గాసిప్స్

రష్మిక మందన్నా ప్రస్తుతం సౌత్ ఇండియన్ సినిమాల్లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్గా నిలిచినట్లు రిపోర్ట్స్ చెబుతున్నాయి. రాబోయే ‘కాక్టెయిల్ 2’ సినిమాకు ఆమె సుమారు ₹15 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఆమె నయనతార, త్రిష వంటి స్టార్ హీరోయిన్లను కూడా దాటినట్లు ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది.
‘పుష్ప 2’, ‘యానిమల్’, ‘ఛావా’ వంటి పాన్ ఇండియా హిట్ ప్రాజెక్టుల విజయాలతో రష్మిక మార్కెట్ విలువ భారీగా పెరిగిందని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఈ రెమ్యునరేషన్ వివరాలు అధికారికంగా ధృవీకరించబడలేదు. అయినప్పటికీ సోషల్ మీడియాలో ఈ వార్తలు పెద్ద చర్చకు దారి తీశాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!