
జనరల్

రంపచోడవరంలోని ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్-టీచర్ మీటింగ్ 4.0 కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం విద్యార్థులతో సరదాగా ముచ్చటించారు. వారి చదువు, పాఠశాలలోని అనుభవాల గురించి అడిగి తెలుసుకుంటూ వారితో ఆత్మీయంగా మాట్లాడారు.
కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మధ్య సమన్వయాన్ని పెంపొందించడంతో పాటు పిల్లల విద్యలో తల్లిదండ్రుల భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడమే మెగా పేరెంట్-టీచర్ మీటింగ్ కార్యక్రమం ప్రధాన ఉద్దేశంగా ఉంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!