

నాలుగేళ్ల క్రితం వెండితెరపై ప్రేక్షకుల మనసులు దోచుకున్న అందమైన ప్రేమకథ సీతారామం. దుల్కర్ సల్మాన్ లెఫ్టినెంట్ రామ్గా, మృణాల్ ఠాకూర్ సీతామహాలక్ష్మిగా నటించి, ఆ పాత్రల్లో పూర్తిగా ఒదిగిపోయారు. హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం 2022 లో విడుదలై క్లాసిక్ హిట్గా నిలిచింది. ఇప్పుడు, అదే బ్లాక్బస్టర్ జంట మరోసారి తెరపై కనిపించబోతుందన్న వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
కాంబినేషన్ రిపీట్?
ఇటీవల సోషల్ మీడియాలో ఒక ఫోటో చక్కర్లు కొడుతోంది. అందులో దుల్కర్ సల్మాన్ మరియు మృణాల్ ఠాకూర్ వర్షంలో ఒకే గొడుగు కింద నిలబడి ఒకరినొకరు చూస్తున్నారు. ఈ ఫోటో చూసిన అభిమానులు — “సీతారామం 2 వస్తుందా?” అని ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ఎందుకంటే మొదటి భాగంలో రామ్ మరణంతో కథ ముగిసింది. ఇక రెండో భాగంలో రామ్ ఎలా తిరిగి వస్తాడు? కథ ఎలా కొనసాగుతుంది? అన్న ఉత్కంఠత అందరిలో పెరుగుతోంది.
సీక్వెల్ వస్తుందా?
గతంలో సీతారామం సీక్వెల్ గురించి దుల్కర్ మాట్లాడుతూ — “క్లాసిక్గా నిలిచిన సినిమాలను మళ్లీ తాకరాదనే విషయం నేను నటుడిని కాకముందే తెలుసుకున్నాను. సీతారామం సినిమాను ప్రేక్షకులు తమ హృదయాల్లో దాచుకున్నారు. దీనికి సీక్వెల్ ఉండదు” అని చెప్పాడు.
కానీ ఇప్పుడు వచ్చిన ఈ కొత్త పోస్టర్ చూసి, ఇది వారి కొత్త సినిమా ప్రచార ఫోటోనా? లేక సీతారామం 2 కా? అన్న సందేహం కలుగుతోంది. ఏదేమైనా, దుల్కర్–మృణాల్ జంట మరోసారి తెరపై కనబడతారని అభిమానులు నమ్ముతున్నారు. ఎందుకంటే వీరిద్దరి కాంబినేషన్ అంటే వెండితెరపై మ్యాజిక్ ఖాయమని ప్రేక్షకులు భావిస్తున్నారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!