

చంచల్గూడ కేంద్ర కారాగారంలో ప్రజలకు కారాగార జీవితం గురించి అవగాహన కల్పించే లక్ష్యంతో ‘ఫీల్ ది జైల్’ అనే వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్ల, జైళ్ల శాఖ ఉన్నతాధికారులు పాల్గొని ఈ కార్యక్రమంతో పాటు కొత్తగా ఏర్పాటు చేసిన జైలు ప్రదర్శనశాలను ప్రారంభించారు. నేరాల వల్ల స్వేచ్ఛ కోల్పోతే జీవితం ఎలా మారిపోతుందో ప్రజలకు, ముఖ్యంగా యువతకు తెలియజేయడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు.
ఈ కార్యక్రమం ద్వారా సాధారణ ప్రజలు నిర్ణీత రుసుము చెల్లించి ఒక రోజు పాటు ఖైదీలా కారాగారంలో గడపవచ్చు. ఖైదీలు ధరించే దుస్తులు ధరించి, వారిలాగే బ్యారక్లలో ఉండి, జైలు నిబంధనల ప్రకారం జీవనం అనుభవించే అవకాశం కల్పించారు. అలాగే ప్రారంభించిన జైలు ప్రదర్శనశాలలో నిజాం కాలం నాటి చరిత్ర, సంకెళ్లు, ఆయుధాలు, ఉరిశిక్షకు ఉపయోగించిన తాళ్లు, పాత రికార్డులు వంటి అనేక చారిత్రక వస్తువులను ప్రదర్శనకు ఉంచారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!