

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వలసల అంశంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పేద దేశాల నుంచి భారీ సంఖ్యలో ప్రజలు అమెరికాకు వలస రావడం దేశ భవిష్యత్తుపై ప్రభావం చూపుతుందని ఆయన పేర్కొన్నారు. ట్రూత్ సోషల్లో చేసిన పోస్టులో, ఆర్థికంగా బలహీన దేశాల ప్రజలు పెద్దఎత్తున అమెరికాకు వస్తే దేశ ఆర్థిక స్థితి దెబ్బతినే ప్రమాదం ఉందని తెలిపారు. అక్రమ వలసలను అరికట్టి అమెరికాను మరింత బలమైన దేశంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.
ఇటీవల హెచ్-1బీ వీసాలపై ప్రతిపాదించిన లక్ష డాలర్ల ఫీజును ఫెడరల్ కోర్టు రద్దు చేయడంపై కూడా ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఫెడరల్ న్యాయమూర్తులు తమ విధానాలకు అడ్డంకులు సృష్టిస్తున్నారని విమర్శించారు. మరోవైపు వైట్హౌస్ ప్రతినిధి టేలర్ రోజర్స్ మాట్లాడుతూ, హెచ్-1బీ కార్యక్రమం దశాబ్దాలుగా దుర్వినియోగానికి గురవుతోందని, దాన్ని సరిచేయడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలిపారు. ఈ అంశంపై కూడా న్యాయస్థానాల నుంచి అనుకూల తీర్పు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!