
జనరల్

హైదరాబాద్ నగరంలో రేపు వన మహోత్సవం ఘనంగా నిర్వహించనున్నారు. హెచ్ఎండీఏ మరియు సిటీ టెర్రస్ గార్డెనర్స్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. శనివారం మధ్యాహ్నం నెక్లెస్ రోడ్ వద్ద నర్సరీ మేళాను ఏర్పాటు చేసి, ప్రజలకు మొక్కల ప్రాధాన్యంపై అవగాహన కల్పించనున్నారు.
ప్రతి ఇంటికి ఐదు మొక్కలను ఉచితంగా పంపిణీ చేయడానికి హెచ్ఎండీఏ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. పండ్ల, ఔషధ, అలంకరణ మొక్కలను ఉచితంగా అందించనున్నారు. ఇంటింటా హోమ్ గార్డెన్స్ను ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం. విద్యార్థులు, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!