

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయం లో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేసవి సెలవుల నేపథ్యంలో గత వారం రోజులుగా తిరుమలకు భారీగా భక్తులు తరలివస్తున్నారు. శ్రీవారి దర్శనం కోసం గంటల తరబడి క్యూ లైన్లలో వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. క్యూ లైన్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా టీటీడీ రికార్డు స్థాయిలో దర్శనాలు కల్పిస్తున్నప్పటికీ, పెరుగుతున్న రద్దీ కారణంగా భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఈ నేపథ్యంలో భక్తులకు ఊరటనిచ్చేలా టీటీడీ కొత్తగా ‘రీ ఎంట్రీ’ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. దీని ద్వారా భక్తులు అవసరమైతే క్యూ లైన్ల నుంచి బయటకు వెళ్లి, దర్శనానికి రెండు గంటల ముందు మళ్లీ క్యూలో చేరే అవకాశం కల్పించారు. 24 నుంచి 32 గంటల వరకు వేచి ఉండాల్సిన పరిస్థితుల్లో వృద్ధులు, చిన్నపిల్లలతో వచ్చే కుటుంబాలకు ఈ విధానం ఉపశమనం కలిగించనుంది. సోమవారం ఒక్కరోజే 89,399 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నట్లు టీటీడీ వెల్లడించింది.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!