

అమెరికా ఎన్నికల్లో ఓటరు గుర్తింపు, పౌరసత్వ నిబంధనలను మరింత కఠినతరం చేయాలని భావిస్తున్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ‘సేవ్ అమెరికా యాక్ట్’ను తక్షణమే ఆమోదించాలని మరోసారి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా భారత్, అమెరికా ఎన్నికల విధానాలను ప్రస్తావిస్తూ భారత్ ఎన్నికల నిర్వహణను ఉదాహరణగా తీసుకోవాలని సూచించారు. భారత్లో ప్రతి ఓటరుకు చెల్లుబాటు అయ్యే ఫొటో గుర్తింపు కార్డు ఉండటం, 2024 సార్వత్రిక ఎన్నికల్లో 64.6 కోట్ల మంది ఓటర్లు పాల్గొనడం వంటి అంశాలను ఆయన ప్రస్తావించారు.
ఇటీవల భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్కుమార్ అమెరికా ఎన్నికల విధానంపై చేసిన వ్యాఖ్యలను కూడా ట్రంప్ ప్రస్తావించారు. అమెరికాలో గుర్తింపు కార్డు లేకుండా ఎన్నికలు ఎలా నిర్వహిస్తారని ఆయన ప్రశ్నించారని పేర్కొన్నారు. భారత్లో 2024 ఎన్నికల్లో ఒక శాతం కంటే తక్కువ మంది మాత్రమే పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేశారని ట్రంప్ తెలిపారు. అమెరికా ఎన్నికల్లో కఠిన నిబంధనలు అమలు చేయాలన్న తన వాదనకు భారత్ ఎన్నికల విధానాన్ని ఉదాహరణగా చూపిస్తూ ‘సేవ్ అమెరికా యాక్ట్’ను ఆమోదించాలని ఆయన కోరుతున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!