
గాసిప్స్

తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద రైతుల ఖాతాల్లో ఆర్థిక సాయాన్ని వేగంగా జమ చేస్తోంది. కేవలం నాలుగు రోజుల్లోనే రూ.6,590.37 కోట్లను నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. నాలుగో విడతలో 4 నుంచి 5 ఎకరాల భూమి కలిగిన రైతులకు ఈ సాయం అందించారు.
వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం, తాజా విడతలో 4.41 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.1,188 కోట్లను జమ చేశారు. ఇప్పటివరకు మొత్తం 65.76 లక్షల మంది రైతులకు రైతు భరోసా పథకం ద్వారా రూ.6,590.37 కోట్ల ఆర్థిక సహాయం అందించినట్లు ఆయన పేర్కొన్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!