

పుణెలోని గురునానక్ డెయిరీ అండ్ స్వీట్స్ లైసెన్స్ను సస్పెండ్ చేసిన వ్యవహారంపై బాంబే హైకోర్టు మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్డీఏ)పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫుడ్ పాయిజనింగ్ ఫిర్యాదు, పరిశుభ్రతపై ఆందోళనల నేపథ్యంలో జూన్ 12న దుకాణం లైసెన్స్ను అధికారులు సస్పెండ్ చేశారు. అనంతరం యజమాని లోపాలను సరిదిద్దామని, కంప్లయన్స్ రిపోర్టును సమర్పించామని తెలిపారు. తాజా తనిఖీలో దుకాణానికి 98 శాతం ఫుడ్ సేఫ్టీ స్కోర్ వచ్చినప్పటికీ మరో 34 రోజుల పాటు లైసెన్స్ను పునరుద్ధరించలేదు. దీంతో సుమారు రూ.8.5 లక్షల నష్టం వాటిల్లిందని యజమాని కోర్టుకు తెలిపారు.
ఈ వ్యవహారంపై ఎఫ్డీఏ తీరును ప్రశ్నించిన హైకోర్టు.. ఐఏఎస్ అధికారి తుకారాం ముండే నేతృత్వంలోని విభాగం పనితీరుపైనా వ్యాఖ్యలు చేసింది. ‘‘మీ ఉద్దేశాలు ప్రశంసనీయం.. కానీ మీరు మీ పరిధిని దాటి వెళ్తున్నారు’’ అని పేర్కొంది. అనంతరం స్వీట్ షాపును వెంటనే తిరిగి తెరవడానికి అనుమతించిన కోర్టు, దుకాణ యజమానికి 30 రోజుల్లోగా రూ.5 లక్షల పరిహారం చెల్లించాలని ఎఫ్డీఏను ఆదేశించింది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!