
క్రీడలు

ఉన్నత న్యాయస్థానాల న్యాయమూర్తుల నియామకాలకు సంబంధించిన కొలీజియం వ్యవస్థపై సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది. న్యాయమూర్తుల ఎంపిక ప్రక్రియ న్యాయ సమీక్ష పరిధికి అతీతమని, దానిని సాధారణంగా కోర్టులు పరిశీలించలేవని స్పష్టం చేసింది. ఈ తీర్పు ద్వారా న్యాయవ్యవస్థ స్వతంత్రతను పరిరక్షించే నియామక విధానానికి మరింత బలం చేకూరిందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
అలాగే జడ్జీల నియామక ప్రక్రియ సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) పరిధిలోకి రాదని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. హిమాచల్ ప్రదేశ్కు చెందిన సీనియర్ జుడీషియల్ అధికారిని దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేస్తూ, కొలీజియం నిర్ణయాల్లో జోక్యం చేసుకోవడం వల్ల కొత్త సమస్యలు తలెత్తే అవకాశముందని పేర్కొంది. ఈ తీర్పు ప్రస్తుత న్యాయమూర్తుల నియామక వ్యవస్థకు మద్దతుగా నిలిచిన కీలక నిర్ణయంగా భావిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!