

నంద్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి దేవస్థానానికి భారీగా హుండీ ఆదాయం లభించింది. ఆలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో పకడ్బందీగా హుండీ లెక్కింపు నిర్వహించారు. గత 33 రోజులుగా భక్తులు సమర్పించిన కానుకల ద్వారా దేవస్థానానికి మొత్తం ₹5 కోట్ల 28 లక్షల 37 వేల 281 రూపాయల ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈఓ శ్రీనివాసరావు వెల్లడించారు.
నగదు కానుకలతో పాటు 96 గ్రాముల 500 మిల్లీగ్రాముల బంగారం, 3 కిలోల 780 గ్రాముల వెండి కూడా లభించాయి. అలాగే అమెరికా, కెనడా, ఒమన్, యూఏఈ, ఇంగ్లాండ్, మలేషియా, ఆస్ట్రేలియా, ఖతార్, సింగపూర్ దేశాలకు చెందిన విదేశీ కరెన్సీ కూడా హుండీ లెక్కింపులో బయటపడింది. పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య నిర్వహించిన ఈ హుండీ లెక్కింపులో ఆలయ ఈఓ శ్రీనివాసరావుతో పాటు దేవస్థానం అధికారులు, సిబ్బంది, శివసేవకులు పాల్గొన్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!