

తెలంగాణలోని ప్రసిద్ధ శ్రీ బాలబ్రహ్మేశ్వర–జోగులాంబ రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి పనులు పూర్తయ్యాయని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి తెలిపారు. రూ.6.07 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ పనులు 100 శాతం పూర్తయ్యాయి. ప్రపంచస్థాయి ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేసిన ఈ స్టేషన్.. శ్రీ బాలబ్రహ్మేశ్వర స్వామి, జోగులాంబ దేవి అమ్మవారిని దర్శించుకునే భక్తులకు మెరుగైన ప్రయాణ సౌకర్యాలను అందించనుంది.

పునరాభివృద్ధిలో భాగంగా ప్లాట్ఫాంను మధ్యస్థాయి నుంచి హై లెవల్కు పెంచడంతో పాటు ప్లాట్ఫాం విస్తరణ, ఎంట్రెన్స్ ఆర్చ్, రిటైనింగ్ వాల్, పాత స్టేషన్ భవనానికి కొత్త ఎలివేషన్, కొత్త స్టేషన్ భవనం ఇంటీరియర్ పనులు చేపట్టారు. సర్క్యులేటింగ్ ఏరియా అభివృద్ధి, ప్లాట్ఫాంపై కవర్-ఓవర్ ఏర్పాటు, డ్రైనేజ్ వ్యవస్థ, తాగునీటి సరఫరా వంటి సౌకర్యాలను కూడా కల్పించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా రైల్వే మౌలిక సదుపాయాల ఆధునీకరణకు కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!