
క్రీడలు

విజయవాడకు చెందిన గాదే సాయికృష్ణ హత్య కేసులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసు దర్యాప్తు కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ బృందానికి ఐజీ రవి ప్రకాశ్ను అధిపతిగా నియమించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ, అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ అమిత్ బార్డర్, బాపట్ల అదనపు ఎస్పీ ఎల్. సుధాకర్ సభ్యులుగా నియమితులయ్యారు.
ఇక విజయవాడ కృష్ణలంక రౌడీషీటర్ గాదే సాయికృష్ణ హత్య కేసులో కృష్ణలంక సీఐ నాగరాజును అరెస్ట్ చేసేందుకు అధికారులు సింగ్ నగర్ షాదీఖానా ప్రాంతంలోని ఆయన నివాసానికి చేరుకున్నారు. ప్రస్తుతం డీసీపీ లతాకుమారి ఆయనను నివాసంలోనే విచారిస్తున్నారు. ఈ కేసు దర్యాప్తు మరింత వేగం పుంజుకుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!