

ప్రముఖ నటుడు ప్రదీప్ రావత్ బ్లడ్ క్యాన్సర్తో కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన చివరి రోజులను గుర్తుచేసుకుంటూ కుమారుడు విక్రమాదిత్య భావోద్వేగానికి గురయ్యారు. మొదట సాధారణ కడుపు ఇన్ఫెక్షన్గా భావించి చికిత్స అందించినప్పటికీ, వైద్య పరీక్షల్లో అరుదైన రకం బ్లడ్ క్యాన్సర్ ఉన్నట్లు బయటపడిందని తెలిపారు. అనారోగ్యం వేగంగా తీవ్రతరం కావడంతో కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయిందని చెప్పారు.
ఐసీయూలో ప్రదీప్ రావత్ చివరి క్షణాలను గుర్తుచేసుకున్న విక్రమాదిత్య కన్నీటి పర్యంతమయ్యారు. వైద్యులు సీపీఆర్ చేసినప్పటికీ ఆయనను కాపాడలేకపోయారని తెలిపారు. ముంబయిలోని ఓషివారా శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించగా, ఆమిర్ ఖాన్ సహా పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు నివాళులర్పించారు. తెలుగు సహా పలు భాషల్లో 150కు పైగా సినిమాల్లో నటించిన ప్రదీప్ రావత్ తన నటనతో ప్రత్యేక గుర్తింపు పొందారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!