

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 15వ తేదీ నుంచి కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని ప్రారంభించనుంది. నకిలీ కార్డుల తయారీని నివారించేలా ఈ కార్డులను తొమ్మిది రకాల ఆధునిక భద్రతా ఫీచర్లతో రూపొందించారు. బ్యాంకు నోట్లు, పాస్పోర్టులు వంటి అత్యంత భద్రత కలిగిన పత్రాల్లో ఉపయోగించే సాంకేతికతను కూడా ఇందులో వినియోగించారు. వీటిని ‘ఆహార భద్రత కార్డులు’గా పేర్కొంటారు.
కొత్త కార్డులపై ఎడమవైపు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, కుడివైపు పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్కుమార్ రెడ్డి చిత్రాలను ముద్రించారు. రేషన్ కార్డు నంబర్, కుటుంబ యజమాని పేరు, చౌకధరల దుకాణం సంఖ్యతో పాటు గ్రామం, మండలం, జిల్లా, ఇంటి చిరునామా వివరాలు ఉంటాయి. కుటుంబ యజమానిగా మహిళల పేర్లనే ముద్రించారు. కార్డులోని ఆధునిక భద్రతా ఫీచర్ల కారణంగా స్కాన్ చేయగానే లబ్ధిదారుల వివరాలను సులభంగా నిర్ధారించవచ్చు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!