
జనరల్

బీఎస్ 6 ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న వాహనాల యజమానులకు కేంద్ర ప్రభుత్వం త్వరలో ఊరట కల్పించే అవకాశం ఉంది. పొల్యూషన్ అండర్ కంట్రోల్ ధ్రువపత్రం గడువును పెంచే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం. దీంతో తరచూ కాలుష్య పరీక్షలు చేయించాల్సిన అవసరం తగ్గే అవకాశం ఉంది.
ప్రస్తుతం నిర్దిష్ట వ్యవధిలో కాలుష్య పరీక్షలు నిర్వహించి ధ్రువపత్రాన్ని పునరుద్ధరించాల్సి ఉండగా, కొత్త ప్రతిపాదన అమల్లోకి వస్తే ఆరు సంవత్సరాల లోపు ఉన్న ప్రైవేటు బీఎస్ 6 వాహనాలకు ఒకేసారి మూడేళ్ల వరకు చెల్లుబాటు కల్పించనున్నారు. ఈ నిర్ణయం వాహనదారులకు సమయం, ఖర్చు పరంగా ఉపశమనం కలిగించనుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!