

నీట్ యూజీ 2026 పరీక్ష పేపర్ లీక్ ఆరోపణలతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో మే 3న నిర్వహించిన పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ రద్దు చేసి, వచ్చే నెల 21 న మళ్లీ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మీడియాతో మాట్లాడుతూ, లీక్ ఘటనపై సమగ్ర దర్యాప్తుకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ఇప్పటికే ఈ కేసును సీబీఐ విచారిస్తున్నదని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. విద్యార్థులకు ఎలాంటి నష్టం కలగకుండా వారి భవిష్యత్తును కాపాడడమే ఈ నిర్ణయానికి కారణమని స్పష్టం చేశారు.
వచ్చే ఏడాది నుంచి నీట్ పరీక్షను ఆన్లైన్లో నిర్వహిస్తామని కూడా ఆయన వెల్లడించారు. రీ ఎగ్జామ్ను పారదర్శకంగా నిర్వహించేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. విద్యార్థులు తమకు అనుకూలమైన పరీక్ష నగరాన్ని ఎంచుకోవడానికి వారం రోజులు గడువు ఇస్తామని, వచ్చే నెల 14 న అడ్మిట్ కార్డులు విడుదల చేస్తామని తెలిపారు. రీటెస్ట్ కోసం అదనపు ఫీజు అవసరం లేదని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను నమ్మి ఆందోళన చెందవద్దని విద్యార్థులకు సూచించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!