
సినిమాలు

డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్కు మరోసారి పెరోల్ మంజూరైంది. ఈసారి 30 రోజుల పాటు విడుదలకు అనుమతి ఇచ్చారు. 2017లో శిక్ష విధించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయనకు మొత్తం 16 సార్లు పెరోల్ లభించడం గమనార్హం. ఈ ఏడాది జనవరిలో కూడా ఆయనకు 40 రోజుల పెరోల్ మంజూరు చేయడం పెద్ద చర్చకు దారితీసింది.
అత్యాచారం కేసులో దోషిగా తేలిన రామ్ రహీమ్కు వరుసగా పెరోల్లు మంజూరు కావడం వివాదాస్పదంగా మారింది. ఈ నిర్ణయాలపై పలువురు విమర్శలు వ్యక్తం చేస్తుండగా, అధికార వర్గాలు మాత్రం అన్ని నిబంధనలను అనుసరించి నిర్ణయాలు తీసుకుంటున్నామని చెబుతున్నాయి.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!