

టాలీవుడ్ విలక్షణ నటుడు రాహుల్ రామకృష్ణ చేసిన తాజా పొలిటికల్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సామాజిక, రాజకీయ అంశాలపై తన అభిప్రాయాలను బహిరంగంగా వ్యక్తం చేసే రాహుల్.. తాజాగా “చితి చివరిదాకా.. కేసీఆర్!” అంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు. అయితే ఈ వ్యాఖ్యలను ఆయన ఏ సందర్భంలో చేశారనే దానిపై స్పష్టత లేదు. దీంతో ఈ పోస్టుపై సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ జరుగుతోంది.
బీఆర్ఎస్ మద్దతుదారులు, కేసీఆర్ అభిమానులు ఈ పోస్టును రీట్వీట్ చేస్తూ మద్దతు తెలుపుతున్నారు. మరోవైపు కొందరు నెటిజన్లు రాహుల్ రామకృష్ణ రాజకీయ వైఖరిని విమర్శిస్తున్నారు. రాజకీయ అంశాలపై రాహుల్ స్పందించడం ఇదే తొలిసారి కాదు. గతంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కూడా తీవ్ర చర్చకు దారితీశాయి. తెలంగాణ రాజకీయ పరిస్థితులపై కేసీఆర్, కేటీఆర్లను ట్యాగ్ చేస్తూ ఆయన గతంలో చేసిన పోస్టులు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
‘అర్జున్ రెడ్డి’, ‘గీత గోవిందం’, ‘బ్రోచేవారెవరురా’, ‘జాతి రత్నాలు’, ‘ఆర్ఆర్ఆర్’, ‘ఓం భీమ్ బుష్’ వంటి చిత్రాల్లో తనదైన కామెడీ, సంభాషణలతో ఆకట్టుకున్న రాహుల్ రామకృష్ణ నటుడిగానే కాకుండా రచయితగా కూడా గుర్తింపు పొందారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!