
సినిమాలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెలిగొండ ప్రాజెక్టుపై కీలక ప్రకటన చేశారు. ఈ నెల 31న ప్రాజెక్టును ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. 30 ఏళ్ల క్రితం తాను తీసుకున్న సంకల్పం ఇప్పుడు నెరవేరుతోందని పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం ‘ఎక్స్’ వేదికగా “వెలిగొండ జలసిరులు–అభివృద్ధికి రెక్కలు” అంటూ పోస్ట్ చేశారు. 30 ఏళ్ల క్రితం ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన ఫొటోను కూడా పంచుకున్నారు.
ప్రతి రైతు పొలానికి నీరు, ప్రతి యువకుడికి ఉపాధి, ప్రతి కుటుంబానికి భరోసా కల్పించడమే తన లక్ష్యమని చంద్రబాబు తెలిపారు. వెలిగొండ ప్రాజెక్టుతో పశ్చిమ ప్రకాశం ప్రాంతంలో సాగునీరు, తాగునీటి సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే ఇంటింటికీ కుళాయి ద్వారా తాగునీరు అందించి, ఫ్లోరైడ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని తెలిపారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!