
క్రీడలు

తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటుపై కొనసాగుతున్న ఉత్కంఠ మధ్య నటుడు ప్రకాష్రాజ్ గవర్నర్ వైఖరిపై తీవ్ర విమర్శలు చేశారు. విజయ్ పార్టీకి ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారని పేర్కొంటూ ఆయన సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. సభలో బలం నిరూపించుకునే అవకాశం ఇవ్వకుండా వ్యవహరించడం రాజ్యాంగ విరుద్ధమని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం తమిళ రాజకీయాల్లో ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
విజయ్కు ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఇవ్వాలని ప్రకాష్రాజ్ డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పుకే అత్యంత ప్రాధాన్యం ఉండాలని ఆయన పేర్కొన్నారు. మరోవైపు తమిళనాడులో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతుండగా, విజయ్ ప్రభుత్వ ఏర్పాటుపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది. ప్రకాష్రాజ్ వ్యాఖ్యలతో ఈ అంశం మరింత హాట్ టాపిక్గా మారింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!